Skip to main content

RGUKT: ట్రిపుల్‌ఐటీ అభ్యర్థులకు కాల్‌లెటర్లు

రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో నిర్వహించనున్న అడ్మిషన్లలో భాగంగా ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు, జనరల్‌ అభ్యర్థులకు కాల్‌లెటర్‌లు పంపుతున్నట్లు వైస్‌చాన్స్‌లర్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ట్రిపుల్‌ఐటీ అభ్యర్థులకు కాల్‌లెటర్లు
ట్రిపుల్‌ఐటీ అభ్యర్థులకు కాల్‌లెటర్లు

 అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను నవంబర్‌ 22 నుంచి నిర్వహించనున్నారు. అభ్యర్థులకు పంపిన కాల్‌లెటర్లలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు, జనరల్‌ అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన ధ్రువీకరణపత్రాల వివరాలను పేర్కొన్నామన్నారు.  

శభాష్‌ సర్పంచ్‌.. ప్రథమ పౌరుడి ‘పాఠ’వం

ఎన్‌ఆర్‌ఐల అడ్మిషన్‌ ఇలా.. 
ఆర్జీయూకేటీలో చదవాలనుకునే ఎన్‌ఆర్‌ఐలు తమ వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో నవంబర్‌ 20లోగా నమోదు చేసుకోవాలన్నారు. వీరు నవంబర్‌ 30న నిర్వహించే కౌన్సెలింగ్‌కు ఇడుపులపాయకు కానీ, నూజివీడు క్యాంపస్‌కు కానీ రావాల్సి ఉంటుందన్నారు. 


చదవండి: ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 29 Oct 2021 04:46PM

Photo Stories