Skip to main content

New Course in Degree: ప్రభుత్వ మహిళా కళాశాలలో కెమిస్ట్రీలో కొత్తగా కోర్సు

గుంటూరు ఎడ్యుకేషన్‌: సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల రసాయన విభాగంలో కొత్తగా ఎనలిటికల్‌ కెమిస్ట్రీ ఆనర్స్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీఆర్‌ జ్యోత్స్నకుమారి సెప్టెంబ‌ర్ 12న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
New Course in Chemistry in Govt Womens College

జిల్లాలో ప్రప్రథమంగా మహిళా కళాశాలలో ప్రారంభిస్తున్న ఈ కోర్సును అభ్యసించడం ద్వారా విద్యార్థినులకు వివిధ రకాల లేబోరేటరీ, ఫార్మా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.

చదవండి: General V Madhusudan Reddy: ఎన్‌సీసీ బలోపేతమే లక్ష్యం.. ప్ర‌తి జిల్లాల్లో ఈ అకాడమీ

ప్రస్తుతం డిగ్రీ మూడో విడతలో బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశాలు జరుగుతున్నాయని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మూడో విడతలో సెప్టెంబ‌ర్ 15లోపు రిజిస్ట్రేషన్‌, 16లోపు సర్టిఫికెట్ల పరిశీలన, 18వ తేదీలోపు వెబ్‌ ఆప్షన్లు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబ‌ర్ 22న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

Published date : 14 Sep 2024 09:19AM

Photo Stories