Skip to main content

Geetha Bhupal Reddy Govt Junior College: పేద విద్యార్థులను ప్రోత్సహిద్దాం

రామచంద్రాపురం(పటాన్‌ చెరు) : పట్టణంలోని గీతా భూపాల్‌ రెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 16వ వార్షికోత్సవాన్ని ఫిబ్ర‌వ‌రి 22న‌ ఘనంగా నిర్వహించారు.
Lets encourage poor students  Geetha Bhupal Reddy Government Junior College

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు విద్యనందించాలని ఉద్దేశంతో మాజీ ప్రోటన్‌ చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి సొంత నిధులతో కార్పొరేట్‌ స్థాయిలో గీతా భూపాల్‌ రెడ్డి జూనియర్‌ కళాశాల భవనాన్ని నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు.

చదవండి: Mallu Bhatti Vikramarka: ‘ఇంటర్నేషనల్‌’ గురుకుల భవనాలు!

30 మందితో ప్రారంభమైన ఈ కళాశాల నేడు 1200 మంది వరకు విద్యార్థులు చదువుతూ ఉండడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. కళాశాలలో ఆడిటోరియం నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని అన్నారు. కార్పొరేటర్లు పుష్ప, సింధు, మెట్టు కుమార్‌, యాదగిరి యాదవ్‌, తొంట అంజయ్య, గూడెం మధుసూదన్‌ రెడ్డి, బాల్‌ రెడ్డి, రాజేశ్వర్‌ రెడ్డి, ఆదర్శ రెడ్డి, సీఐ నరేందర్‌ రెడ్డి, ఎస్సై శశికాంత్‌, ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వర్‌, విజయ్‌, పరమేష్‌ పాల్గొన్నారు.

Published date : 23 Feb 2024 12:54PM

Photo Stories