KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు
Sakshi Education
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడువును ఏప్రిల్ 13వ తేదీ వరకు పొడిగించారు.
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏప్రల్ 9న రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు షెడ్యూల్ 11వ తేదీతో ముగియనుంది. అయితే పలువురి నుంచి వచ్చిన వినతులతో పాటు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గడువును 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేవీఎస్ పేర్కొంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ‘కేవీఎస్ఆన్ లైన్ అడ్మిషన్స్.కేవీఎస్.జీవోవీ.ఐఎన్’ను సందర్శించాలని సంస్థ వివరించింది.