Skip to main content

Kishan Reddy: విద్యారంగంపై వాళ్లది నేరమయ నిర్లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యారంగంపై కాంగ్రెస్, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు నేరమయ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
criminal neglect of education

తాజాగా ప్రకటించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) లో... రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల పనితీరు బయటపడిందని వివరించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఆగ‌స్టు 13న‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

చదవండి: Top 10 Engineering Colleges in India : దేశంలోని టాప్-10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. వీటిలో చదివారంటే లక్షల్లో ప్యాకేజీలు

ఉస్మానియాకు 70వ ర్యాంకా? 

‘ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఓవరాల్‌ విభాగంలో.. ఉ స్మానియా వర్సిటీ 70వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. కొన్నేళ్లుగా ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడం అ టుంచితే, ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలోనూ విఫలమై మన యూనివర్సిటీలు దిగజారుతున్నా యి.

కళాశాల విభాగంలో టాప్‌ 100లో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీకీ స్థానం దక్కలేదు.’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితైతే మరింత అధ్వానంగా ఉంది.

ఐటీ క్యాపిటల్‌గా చెప్పుకునే తెలంగాణలో పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సదుపాయం లేదు.. 24వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీగా పెట్టారంటే పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై వీరికున్న ప్రేమేంటో అర్థమవుతోంది’’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.  

Published date : 14 Aug 2024 11:24AM

Photo Stories