Skip to main content

బీఎస్సీ పారా మెడికల్‌.. వైద్యవిద్య అనుబంధ కోర్సులివే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను ప్రభుత్వం ప్రారంభిస్తోంది.
BSc Para Medical
బీఎస్సీ పారా మెడికల్‌.. వైద్యవిద్య అనుబంధ కోర్సులివే..

బీఎస్సీ పారామెడికల్‌ పేరిట తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం (2022–23) నుండే ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ డిపెంబర్‌ 27న ఉత్తర్వులు జారీ చేసింది. గాందీ, కాకతీయ, రిమ్స్, ఉస్మానియా, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11 వైద్య విద్య అనుబంధ కోర్సులు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూడేళ్ల కోర్సు, ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌తో కలుపుకొని నాలుగేళ్ల కాల వ్యవధి ఉంటుంది. తాజా నిర్ణయం వల్ల ప్రతి సంవత్సరం 860 మంది (860 సీట్లు) లబ్ధి పొందుతారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నాయి. ఫీజులు, అడ్మిషన్లకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. 

మెరుగైన వైద్యసేవల కోసమే: హరీశ్‌రావు 

‘రాష్ట్ర ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలతో పాటు, వైద్య విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత 12 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించగా, మరో రెండేళ్లలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్య అనుబంధ సేవలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది..’అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

వైద్యవిద్య అనుబంధ కోర్సులివే.. 

  • అనస్థీషియా
  • ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ
  • రెస్పిరేటరీ థెరపీ  ళీ రీనల్‌ డయాలసిస్‌
  • న్యూరోసైన్స్‌  ళీ క్రిటికల్‌ కేర్‌
  • రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్‌
  • ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ థెరపీ
  • మెడికల్‌ రికార్డ్స్‌ సైన్సెస్‌
  • ఆప్తోమెట్రిక్‌
  • కార్డియాక్‌ అండ్‌ కార్డియోవాస్క్యూలర్‌ టెక్నాలజీ 
Published date : 28 Dec 2022 02:41PM

Photo Stories