National Education Policy: జాతీయ విద్యావిధానంతో మెరుగైన విద్య
Sakshi Education
కంది(సంగారెడ్డి): జాతీయ విద్యావిధానం ద్వారా చక్కటి విద్య అందించవచ్చని కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపాల్ భారతి దేవి అన్నారు.
జాతీయ విద్యావిధానంతో మెరుగైన విద్య
జూలై 27న ఓడీఎఫ్లోని కేంద్రియ విద్యాలయంలో కేంద్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో బోధించడం జాతీయ విద్యావిధానం ద్వారా సాధ్యమవుతుందన్నారు.
అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూడేళ్లలో జరిగిన విద్యాభివృద్ధిని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు తయా రు చేసిన కళాకృతులను ప్రదర్శించారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయా విద్యాసంస్థల ఉపాధ్యాయులతోపాటు హెచ్ఎం అనిల్ కుమార్ పాల్గొన్నారు.