Skip to main content

పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. తీవ్ర పోటీ ఉన్న ఈ పరీక్షలో విజయం సాధించాలంటే ఎలా చ‌ద‌వాలి?

Students
AP Police Preparation
 

జీకేకు సంబంధించి చదవాల్సిన అంశాలు:
భారతదేశ జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రాష్ట్రాలు, రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు, అవి నెలకొని ఉన్న ప్రదేశాలు, భారత భౌగోళిక అంశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, భారత రాజ్యాంగంలోని ముఖ్యాంశాలు.

Bavitha

  • రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, న్యాయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, బ్యాంకింగ్ వ్యవస్థ, ఉపాధి కల్పనా పథకాలు, వ్యవసాయ రంగం తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • అంతర్జాతీయ అంశాలలో దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంటు పేర్లు, వివిధ దేశాల జాతీయ చిహ్నాలు, పుష్పాలు, జంతువులు, భౌగోళిక మారుపేర్లు, నదీ తీరాన వెలసిన నగరాలు, అత్యున్నత అంశాలు, ప్రసిద్ధ కట్టడాలు, ప్రదేశాలు, సరస్సులు, జలపాతాలు, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలు, కూటములు వంటి వాటిని చదవాలి.
  • గ్రంథాలు-రచయితలు; ప్రముఖ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు; ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, వివిధ అధ్యయన శాస్త్రాలు, కల్చర్స్, జాతీయ, అంతర్జాతీయ దినాలు, ప్రపంచ సంస్థల ప్రధాన కార్యాలయాలు, వాటి ప్రస్తుత అధిపతులు, రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, భౌగోళిక విషయాలను చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • కరెంట్ అఫైర్స్‌లో ప్రపంచంలో ఏ మూల జరిగిన సంఘటన నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. దీనికి నిర్దేశిత సిలబస్ అంటూ ఉండదు. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేయాలి. రోజూ ఒకట్రెండు ప్రామాణిక వార్తా పత్రికలను చదివి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. మార్కెట్లో పేరున్న ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను కూడా చదవాలి.

 

కరెంట్ అఫైర్స్- ప్రధాన అంశాలు:

 

  • రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు
  • రాజకీయ సంఘటనలు, ఎన్నికలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు
  • వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు
  • వాణిజ్య వ్యవహారాలు
  • శాస్త్ర, సాంకేతిక అంశాలు
  • పర్యావరణం
  • రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు
  • క్రీడలకు సంబంధించిన పోటీలు, విజేతలు, ఇతర ముఖ్యమైన సమాచారం
  • అంతర్జాతీయ సదస్సులు
  • దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు
  • ఆర్థిక సర్వేలు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రాష్ర్ట బడ్జెట్

 

సన్నద్ధత ఎలా?గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, క్లిష్టతను పరిశీలించాలి. వాటికి అనుగుణంగా సిద్ధంకావాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను బిట్లను చదవడానికే పరిమితం చేయకూడదు. ఒక ముఖ్య ఘటన జరిగినప్పుడు దాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం గుర్తించగలరు. ఇటీవల కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. ఈ అంశం నుంచి వేటిని చదవాలో పరిశీలిస్తే..

 

 

  • కామన్వెల్త్ క్రీడలు తొలిసారి 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. అప్పటి నుంచి నాలుగేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. భారతదేశం తొలిసారిగా 1934లో లండన్‌లో జరిగిన క్రీడల్లో పాల్గొంది. మనదేశం 2010లో క్రీడలకు ఆతిథ్యం కూడా ఇచ్చింది. 20వ కామన్వెల్త్ క్రీడలు జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. దాదాపు 4,950 మంది క్రీడాకారులు 18 క్రీడలలో 261 అంశాల్లో పాల్గొన్నారు. మొత్తం 71 జట్లు పాల్గొన్నాయి. భారత్ నుంచి 215 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో షూటర్ విజయ్‌కుమార్ పతాకధారిగా నిలిచాడు.
  • ఇంగ్లండ్ జట్టు 58 బంగారు, 59 రజత, 57 కాంస్య పతకాలతో మొత్తం 174 పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్ 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. మన దేశం 64 పతకాలు సాధించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. వీటిలో 15 స్వర్ణ పతకాలు, 30 వెండి, 19 కంచు పతకాలు ఉన్నాయి.
  • భారత్‌కు మొదటి బంగారు పతకాన్ని మహిళల 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో సంజితా చాను సాధించిపెట్టింది. మన దేశానికి బంగారు పతకాలు లభించిన విభాగాలు.. రెజ్లింగ్ (5), షూటింగ్ (4), వెయిట్ లిఫ్టింగ్ (3), స్క్వాష్ (1), బ్యాడ్మింటన్ (1), అథ్లెటిక్స్ (1).
  • అభినవ్ బింద్రా, అపూర్వి చందేలా జీతురాయ్, రాహి సర్నోబత్ షూటింగ్‌లో స్వర్ణాలు సాధించగా, సుశీల్ కుమార్, యోగేశ్వర్‌దత్ రెజ్లింగ్‌లో, వికాస్ గౌడ్ డిస్కస్ త్రోలో పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకాలు సాధించారు.

 

Published date : 20 Jul 2021 12:11PM

Photo Stories