ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసుల ప్రొబేషన్ డిక్లరేషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్ టెస్ట్ ఫలితాలు జూన్ 1న విడుదలయ్యాయి.
పోలీస్ ఫలితాలు విడుదల
కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకుని అర్హత గల ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగికి జూన్ నెలాఖరులోగా ప్రొబేషన్ ఖరారు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులు వేగంగా ఈ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు.
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా చర్యలు కొనసాగడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు భీమిరెడ్డి అంజన్రెడ్డి, బత్తుల అంకమరావు, బీఆర్ కిశోర్, విప్పర్తి నిఖిల్ కృష్ణ, భార్గవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.