Skip to main content

SI Main Exam: నేడు, రేపు ఎస్‌ఐ పోస్టులకు మెయిన్‌ పరీక్షలు

Court Verdict on Physical Fitness Test Does Not Affect SI Main Exam, SI Main exams,Police Recruitment Board Arrangements for SI Main Examination in Amaravati

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకోసం మెయి­న్‌ పరీక్షలను శని, ఆదివారాల్లో నిర్వహించేందుకు పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ మెయిన్‌ పరీక్షల నిర్వహణపై ప్రభావం చూప­ద­ని పోలీసు నియామక మండలి తెలిపింది. ఈ మేరకు వెబ్‌­సైట్‌లో కూడా ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు నేప­థ్యంలో ఇప్పటికే నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలపై నిర్ణయాన్ని తరువాత ప్రకటించనుంది.

చ‌ద‌వండి: SI Exam: ఎస్‌ఐ పరీక్ష అభ్యర్థులకు ఉచిత భోజన వసతి

రాష్ట్రంలోని నాలు­గు కేంద్రాల్లో.. విశాఖపట్నం, ఏలూరు, గుంటూ­రు, కర్నూలుల్లో శని, ఆదివారాల్లో మెయిన్‌ పరీక్షలు నిర్వ­హించనుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మెయిన్‌ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603. పరీక్షలకు సంబంధించి సందేహా­లుంటే హెల్ప్‌­లైన్‌ నంబర్లు 9441450639, 9100203323కు ఫోన్‌ చేయవచ్చని, ఈమెయిల్‌:  mail- slprb@ap.gov.in లో సంప్రదించవచ్చని సూచించింది.  

ఈ పరీక్షల వివరాలు..  
అక్టోబరు 14: పేపర్‌–1 (డిస్క్రిప్టివ్‌ ) ఉదయం  10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు 
పేపర్‌–2 (డిస్క్రిప్టివ్‌ ) మధ్యాహ్నం 2.30 గంటల  నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 

అక్టోబరు 15: పేపర్‌–3 (ఆబ్జెక్టివ్‌) ఉదయం  10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు     
పేపర్‌–4 (ఆబ్జెక్టివ్‌) మధ్యాహ్నం 2.30 గంటల  నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు

Published date : 14 Oct 2023 02:27PM

Photo Stories