Skip to main content

SI Exam: ఎస్‌ఐ పరీక్ష అభ్యర్థులకు ఉచిత భోజన వసతి

free food and accommodation for si exam candidates

కొయ్యూరు: విశాఖపట్నంలో అక్టోబర్ 14,15 తేదీల్లో నిర్వహించనున్న ఎస్‌ఐ తుది పరీక్ష రాసేందుకు అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వెళ్లే అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎంతో దూరం నుంచి పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థుల ఇబ్బందులను ముందుగానే గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 2019లో జరిగిన గ్రామ,వార్డు సచివాలయ పరీక్షలకు కూడా ఆరు రోజుల పాటు 150 మందికి భోజన వసతి కల్పించామని గుర్తు చేశారు. పూర్తి వివరాలకు 9381558327, 7032264706 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.

చ‌ద‌వండి: Free Training: స్వయం ఉపాధితోనే భవిత పదిలం

Published date : 13 Oct 2023 05:02PM

Photo Stories