రాష్ట్రంలో మే 11న నిర్వహించాల్సిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షను మే 25కు వాయిదా వేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు మే 10న ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ పరీక్ష 25కు వాయిదా
ఆరోజు సమయం, పరీక్ష కేంద్రాల్లో మార్పులేమీ ఉండవన్నారు. తుపాను ప్రభావంతో ఆటంకం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మే 12 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.