Skip to main content

Intermediate: ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న 352 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో 2022–23 విద్యా సంవత్సరానికి Intermediate మొదటి ఏడాది ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి జూన్‌ 26న ఒక ప్రకటనలో తెలిపారు.
Intermediate
ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

గత విద్యా సంవత్సరం వరకు రాష్ట్రంలోని 221 కేజీబీవీల్లో మాత్రమే Intermediate విద్య అందించగా, ఈ విద్యా సంవత్సరం నుంచి మిగిలిన 131 కేజీబీవీల్లో కూడా Intermediate విద్య అప్‌ గ్రేడ్‌ చేశామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అనాథలు, పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీపీఎల్‌ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే ప్రవేశాలకు పరిగణిస్తామన్నారు. ఆసక్తిగల బాలికలు 27వ తేదీ నుంచి జూలై 12 వరకు https://apkgbv.apcfss.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు పొందాలని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌ మెసేజ్‌ ద్వారా సమాచారం అందుతుందని వివరించారు. సంబంధిత కేజీబీవీల నోటీసు బోర్డులో నేరుగానూ చూడవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 94943 83617, 94907 82111 నంబర్లను సంప్రదించాలని వెట్రిసెల్వి కోరారు. 

చదవండి: 

Published date : 27 Jun 2022 02:02PM

Photo Stories