కె.కోటపాడు: పది విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ అన్నారు.
పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ఎ.కోడూరు పాఠశాలను నవంబర్ 2న ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పది విద్యార్థులకు నిర్వహిస్తున్న అదనపు తరగతుల వివరాలను, ఉపాధ్యాయుల బోధన ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు.
పదో తరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఎంఈవోలు సత్యనారాయణ, డి.వి.డి.ప్రసాద్, హెచ్ఎం కామేశ్వరరావు డీఈవో వెంట ఉన్నారు.