TS Government Jobs 2023 : వెంట‌నే ఉద్యోగ నియామకాలకు సీఎస్ కీల‌క ఆదేశాలు.. అలాగే పోలీసు ఉద్యోగాల‌ను కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని వివిధ ప్ర‌భుత్వ‌ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డ్యాష్‌ బోర్డును ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మార్చి 14వ తేదీన‌ తెలిపారు.
Telangana Chief Secretary Santhi Kumari, IAS

సర్వీసు అంశాలు, రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్లకు సంబంధించిన పలు శాఖలలో పెండింగ్‌ అంశాలను తక్షణమే పరిష్కరించి ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాలపై బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

TSPSC Question Paper Leak Case 2023 : ఈ ఘ‌నుడు కొశ్చ‌న్ పేప‌ర్ లీక్ చేశాడిలా.. ఆపై ఈమె కథ నడిపించిందిలా..

పోలీసు ఉద్యోగాల‌ను సెప్టెంబ‌ర్‌లోగా..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ కాగా, ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేశామని, ఏప్రిల్‌లో రాత పరీక్షలు పూర్తి చేసి సెప్టెంబ‌ర్‌లోగా నియామకాలు జరుపుతామని సీఎస్‌ పేర్కొన్నారు. మెడికల్‌, హెల్త్‌ సర్వీస్‌ బోర్డు ద్వారా ఆగస్టులోగా 10 వేల మేర వివిధ ఉద్యోగ ఖాళీలను నింపనున్నట్టు తెలిపారు. 

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

గ్రూప్‌ 2, 3, 4 రాత పరీక్షలను..

రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 10 వేల పోస్టులకు సెప్టెంబరులోగా నియామక ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు వివరించారు. అలాగే గ్రూప్‌ 2, 3, 4 రాత పరీక్షలు జులై నెలాఖరులోగా పూర్తిచేస్తామని అధికారులు సీఎస్‌కు తెలిపారు. నవంబరు నెలాఖరు నాటికి సర్వీస్‌ కమిషన్‌కు సంబంధించిన అన్ని రాతపరీక్షలు పూర్తిచేస్తామని చెప్పారు.  ఈ భేటీలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, రోనాల్డ్‌ రోస్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావు, వర్సిటీ కామన్‌ బోర్డు చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి పాల్గొన్నారు.

☛➤ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ప్రభుత్వం సీరియస్‌గా.. 

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లీకేజీపై లోతైన దర్యాప్తు కోసం కేసును నగర అదనపు పోలీస్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) అప్పగించారు. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.

#Tags