AP Grama, Ward Sachivalayam Employees : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో అదనపు బాధ్యత ఇదే..!
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలో ఉద్యోగం కత్తి మీద సాము లా మారింది.
ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించిన విషయం తెల్సిందే.
తాజాగా ప్రభుత్వం వీరికి మరో బాధ్యత అప్పగించనుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తోంది. Andhra Pradesh State Skill Development Corporation, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే అవకాశాలపై మంత్రి లోకేశ్ అధికారులతో చర్చించారు.
#Tags