Gurukul Admissions: గురుకుల ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. అంటూ తేదీని ప్రకటించారు జిల్లా కన్వీనర్‌. వివరాలను పరిశీలించండి..

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ ఈఐఎస్‌) ఆధ్వర్యంలో నడుపుతున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ గుంటూరు జిల్లా కన్వీనర్‌ జె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Gurukul Admissions: ఈనెల 31వ తేదీ వరకు గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు

ఐదో తరగతితోపాటు జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశం పొందేందుకు తాడికొండ, గుంటూరులోని మైనార్టీ బాల, బాలికలు aprs.apsfss.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనార్టీ విద్యార్థులు నేరుగా ఆయా కళాశాలలు, పాఠశాలల్లో ప్రవేశం పొందవచ్చన్నారు.

 39 Jobs: మెరిట్‌ ప్రకారమే నియామకం

#Tags