Gurukul School Principal: ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు, అధ్యాపకుల ఫిర్యాదు..! కారణం..

మంగళవారం పాఠశాలను సందర్శించిన ఏజీఎంకు అక్కడ చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులు ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మెరకు ఆయన విచారణ చేపట్టి కారణాలు తెలుసుకున్నారు..

లేపాక్షి: స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలపై గురుకుల పాఠశాలల కర్నూలు ఏజీఎం రాజేందర్‌రెడ్డి విచారణ చేపట్టారు. మార్చి 26వ తేదీన కళాశాల ప్రార్థన సమయంలో ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌ విద్యార్థుల సమక్షంలోనే తమను దూషించారని అతిథి అధ్యాపకులు, విద్యార్థులు ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌కు, కర్నూలు రీజియన్‌ ఏజీఎంకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

Knox Cyber Security Courses: నాక్స్‌ సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు

ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఏజీఎం రాజేందర్‌రెడ్డి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, అతిథి అధ్యాపకులతో వేర్వేరుగా సమావేశమై విచారించారు. అంతేకాకుండా ప్రిన్సిపాల్‌పై చేసిన ఆరోపణలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, అతిథి అధ్యాపకులు ఇచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌కు పంపుతామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

Donald Trump: రూ.1,460 కోట్ల బాండ్‌ సమర్పించిన ట్రంప్.. దేనికంటే..

#Tags