JEE MAINS 2024: జేఈఈ అభ్యర్థులకు రూట్‌మ్యాప్‌

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తెలిపింది.

జ‌నవ‌రి 24న పేపర్‌–1 (ఆర్కిటెక్చర్‌) జరుగుతుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు ఇప్పటికే పరీక్ష కేంద్రం వివరాలను  https://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. అయితే అడ్మిట్‌ కార్డులను మాత్రం ఇంకా విడుదల చేయలేదు.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్

జ‌నవ‌రి 27న జేఈఈ మెయిన్స్‌ పేపర్‌–2 జరుగుతుంది. ఈ పరీక్ష రాసే వారి కేంద్రాల వివరాలను త్వరలో అందుబాటులోకి తెస్తున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. మెయిన్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 వరకూ జరుగుతాయి.  

చదవండి: IIT and NIT Seats Increase 2024 : ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పెరిగే అవ‌కాశం ఇలా..! అలాగే కటాఫ్ కూడా మార్పు..?

#Tags