APPSC: గ్రూప్‌–1 విజేత జీవన పడాల్‌కు సన్మానం

పాడేరు రూరల్‌ : లక్ష్యాన్ని నిర్ధేశించుకుని కృషి చేస్తే గిరిజన యువత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని ఎస్పీ తుహిన్‌ సిన్హా అన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై న గిరిజన యువతి చిట్టపులి జీవన పడాల్‌ను, ఆమె తల్లిదండ్రులను మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీవన పడాల్‌ను గిరిజన నిరుద్యోగ యువత ఆదర్శంగా తీసుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ(అడ్మిన్‌) పి.అనిల్‌కుమార్‌, డీఎస్‌బీ ఇన్‌స్పెపెక్టర్‌ ఎల్‌. హిమగిరి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: APPSC Group 1: సివిల్స్‌లో విజయమే లక్ష్యం: జయశ్రీ

#Tags