PGCET: పీజీసెట్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్రుగాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీపీజీసెట్–2021 ఫలితాలు నవంబర్ 9న విడుదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో వీటిని విడుదల చేశారు. ఈ ప్రవేశపరీక్షలకు 39,856 మంది దరఖాస్తు చేసుకోగా 35,573 మంది పరీక్ష రాశారు. వీరిలో 24,164 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 17 సబ్జెక్టులకు ఈ ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణులైనవారిలో మహిళలు 14,162 మంది ఉండగా, పురుషులు 10,002 మంది ఉన్నారు. త్వరలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.
ఫలితాలు కోసం క్లిక్ చేయండి
చదవండి:
#Tags