AP ECET 2025: ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET 2025) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

పాలిటెక్నిక్ డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి అవకాశం కలదు. జేఎన్‌టీయూ అనంతపురం (JNTU-A) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

కోర్సులు: బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ.
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: 

  • ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
  • ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ: 07.04.2025
  • దరఖాస్తు సవరణ తేదీలు: 24.03.2025 నుండి 26.03.2025 వరకు.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 01.05.2025
పరీక్ష తేదీ: 06.05.2025
అధికారిక వెబ్‌సైట్: cets.apsche.ap.gov.in 
>> జేఎన్‌సీఏఎస్‌ఆర్ లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags