Telangana DSC 2024 Exams: నేటితో ముగియనున్న తెలంగాణ డీఎస్సీ పరీక్షలు..
తెలంగాణ డీఎస్సీ పరీక్షలు నేటితో ముగుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా జులై 18న ప్రారంభమైన ఈ పరీక్షలు నేటితో(ఆగస్టు 5)ముగియనున్నాయి. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పోస్టుల వారీగా చూస్తే 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.
నేటితో పరీక్షలు ముగియనుండటంతో త్వరలోనే ఆన్సర్ కీని విడుదల చేసి ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు నియాక పత్రాలను అందజేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన జారీ కానుంది.
#Tags