Paris Olympics: పారిస్ ఒలింపిక్స్కు ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లు!
ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందంలో ఒకే విశ్వవిద్యాలయానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉండటం అరుదైన ఘనత.
ఈ అరుదైన అవకాశం చండీగఢ్ విశ్వవిద్యాలయానికి దక్కింది.
ఈ యూనివర్సిటీ విద్యార్థులు భజన్ కౌర్ (ఆర్చరీ), అర్జున్ (షూటింగ్), సంజయ్ (హాకీ), రితిక (రెజ్లింగ్), అక్ష్దీప్ సింగ్ (రేస్ వాకింగ్), యశ్ (కయాకింగ్)లతో పాటు పారాలింపియన్లు పలక్ కోహ్లి (బ్యాడ్మింటన్), అరుణ తన్వర్ (తైక్వాండో) ఒలింపిక్స్లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు.
#Tags