TTD New Chairman: టి.టి.డి కొత్త ఛైర్మ‌న్‌గా భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి?

టి.టి.డి కొత్త ఛైర్మ‌న్‌గా భూమాన క‌రుణాక‌ర్ రెడ్డిని ఖ‌రారు చేసిన ఏపీ ప్ర‌భుత్వం
TTD New Chairman

టి.టి.డి ఛైర్మ‌న్‌గా ప్ర‌స్తుతం వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. 2019లో వైవి సుబ్బారెడ్డి ఛైర్మ‌న్‌గా భాద్య‌త‌లు చేప‌ట్టారు. ఆగ‌స్టు 8తో ప్ర‌స్తుత ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి ప‌ద‌వాకాలం ముగియ‌నున్నది. దీంతో టి.టి.డి త‌దుప‌రి ఛైర్మ‌న్‌గా భూమాన క‌రుణాక‌ర్ రెడ్డిని ఏపీ ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది.  
భూమన కరుణాకర్ రెడ్డి ప్ర‌స్తుతం తిరుపతి నియోజకవర్గం YSRCP శాసనసభ సభ్యుడుగా ఉన్నారు. 2006-2008 మ‌ధ్య టి.టి.డి ఛైర్మ‌న్‌గా ప‌ని చేసిన‌ భూమాన.భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి B.A., M.A. చదివారు.  

రాజకీయ ప్రస్థానం:

2012లో తిరుపతి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సిపి అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో తిరుపతి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత నెలలో (జులై 2023లో) భూమనను సభా హక్కుల కమిటీ ఛైర్మన్‍గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.

☛☛ AP High Court CJ: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌

#Tags