Christianity: సెయింట్‌ హుడ్‌ హోదా పొందనున్న తొలి భారతీయ క్యాథలిక్‌?

హిందూ కుటుంబంలో జన్మించి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన దేవసహాయం పిళ్లైకు సెయింట్‌ హుడ్‌ హోదా లభించనుంది. మతపరమైన కార్యకలాపాల్లో లేని ఒక సామాన్య భారతీయ క్యాథలిక్‌కు సెయింట్‌ హోదా దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేవసహాయంతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన మరో ఐదుగురికి సెయింట్‌ హుడ్‌ హోదా ఇవ్వనున్నారు. 2022, మే 15వ తేదీన వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికాలో జరిగే కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ ఆరుగురికి సెయింట్‌ హుడ్‌ హోదాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఆరుగురికి సెయింట్‌ హోదా ఇవ్వాలని నవంబర్‌ 9న వాటికన్‌లో మతాధికారుల సమ్మేళనంలో నిర్ణయించారు.

సమాన హోదా దక్కాలని..

అప్పటి ట్రావన్‌కోర్‌ సంస్థానం పాలనలోని తమిళనాడు ప్రాంతంలో 1712, ఏప్రిల్‌ 23న నాయర్‌ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. 1745లో క్రైస్తవ మతాన్ని స్వీకరించాక తన పేరును లాజరస్‌గా మార్చుకున్నారు. ధనిక పేద తారతమ్యాలు లేకుండా సమాజంలో అందరికీ సమాన హోదా దక్కాలని ఆయన అభిలషించారు. ఇది ఆనాటి సమాజంలోని అగ్రవర్గాలకు నచ్చేది కాదు. దీంతో 1749లో పాలకులు ఆయనను నిర్బంధించారు. 1752 జనవరి 14న ఆయనను చంపేశారు.
 

చ‌ద‌వండి: కేకేఆర్‌ సలహాదారుగా నియమితులైన బ్యాంకింగ్‌ దిగ్గజం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సెయింట్‌ హుడ్‌ హోదా పొందనున్న తొలి భారతీయ క్యాథలిక్‌?
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు    : దేవసహాయం పిళై(లాజరస్‌)
ఎందుకు : క్రైస్తవ మతాధికారుల నిర్ణయం మేరకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags