భారతీయ శాస్త్రవేత్తకు యూరోప్‌లో అరుదైన గౌరవం

భారతీయ శాస్త్రవేత్త డాక్టర్‌ మహిమా స్వామికి యూరోప్‌లో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక యురోపియన్‌ మాలిక్యులార్‌ బయాలజీ ఆర్గనైజేషన్‌ (ఈఎంబీవో)కు ఆమెను ఎంపిక చేశారు. యూరోప్‌లో ఉన్న మేటి బయాలజీ నిపుణుల్లో ఒకరిగా మహిమా గుర్తించారు. బెంగుళూరుకు చెందిన డాక్టర్‌ మహిమా స్వామి.. యునివర్సిటీ ఆఫ్‌ దుండేలో లైఫ్‌ సైన్సెస్‌లో నిపుణురాలిగా పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న పరిశోధనా బృందానికి ఆమె హెడ్‌గా ఉన్నారు. పేగుల్లో ఇమ్యూనిటీ గురించి ఆ బృందం స్టడీ చేస్తోంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags