AIIMS Director: ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా ఎవరు ఉన్నారు?

ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. మార్చి 25 నుంచి మరో మూడు నెలలు లేదా కొత్త డైరెక్టర్‌ నియమితులయ్యేవరకు(ఏది ముందు జరిగితే అది) పొడిగించాలని ఎయిమ్స్‌ ప్రెసిడెంట్‌ నిర్ణయించినట్లు మార్చి 23న ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. డైరెక్టర్‌ పదవికి 32మంది పోటీ పడుతున్నారు. వీరిలో ఐసీఎంఆర్‌ డీజీ బలరామ్‌ భార్గవ కూడా ఉన్నారు.

CEO of Telangana: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఎవరు నియమితులయ్యారు?

6 ఏళ్లలోపు పిల్లలకు మోడెర్నా టీకా!
తాము రూపొందించినలో డోస్‌ కోవిడ్‌ టీకా ఆరు సంవత్సరాల్లోపు పిల్లల్లో బాగా పనితీరు కనబరుస్తోందని మోడెర్నా మార్చి 23న ప్రకటించింది. నియంత్రణా సంస్థలు అంగీకరిస్తే పిల్లలకు టీకాలనిచ్చే ప్రక్రియ ఆరంభిస్తామని పేర్కొంది. త్వరలో యూఎస్, యూరప్‌ ఔషధ నియంత్రణా సంస్థలకు టీకా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది. పెద్దలు కొంతమందిలో టీకా వల్ల ఎదురయ్యే ఇబ్బందులు చిన్నపిల్లల్లో కనిపించలేదని తెలిపింది.

కోవిడ్‌ ఆంక్షల ఎత్తివేత 
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో గత రెండేళ్లుగా అమల్లో ఉన్న కోవిడ్‌ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కరోనా కట్టడికి విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్టుగా  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్‌ కలకలం సృష్టించినప్పుడు 2020 మార్చి 24న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కోవిడ్‌ నిబంధనల్ని తెచ్చింది.

Chief Minister of Uttarakhand: ఉత్తరాఖండ్‌ సీఎంగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags