Delhi Air Pollution: ఢిల్లీలో ఏక్యూఐ 382కు చేరిన వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) సగటున 382గా నమోదైంది. ఇది దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థాయి అని అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని 15 పర్యవేక్షణ కేంద్రాలలో ఏక్యూఐ 400 కుపైగా ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంతోపాటు నగరంలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ వాయు కాలుష్యం ప్రభావిత ప్రాంతాలలో ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా, ద్వారకా, జహంగీర్పురి, ముండ్కా, నజఫ్గఢ్, ఎన్ఎస్ఐటీ ద్వారకా, నెహ్రూ నగర్, ఓక్లా ఫేజ్-2, పత్పర్గంజ్, పంజాబీ భాగ్, రోహిణి, వజీర్పుర్, వివేక్ విహార్ ప్రాంతాలు ఉన్నాయి. దీనితో పాటు నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలు ఏర్పడవచ్చు.
Census of India: 2025లో దేశ జనాభా గణన.. మారిపోనున్న జనగణన సైకిల్!
#Tags