MQ 9B Drones: భారత సైన్యంలోకి అత్యాధునిక ఎంక్యూ–9బీ డ్రోన్స్‌

భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త అందించింది. భారత్‌కు 31 ఎంక్యూ–9బీ సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్‌ ప్రభుత్వం ఆమో­దం తెలిపింది.

ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు నోటిఫై చేస్తూ అవసరమైన ధ్రువీకరణను అందజేసినట్లు రక్షణ భద్రత సహకార సంస్థ (డీఎస్‌సీఏ) పేర్కొంది. వివరాల ప్రకారం.. అమెరికా, భారత్‌ మధ్య ప్రిడేటర్‌ డ్రోన్లపై ఒప్పందం చివరి దశకు చేరుకుంది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ–9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది.

చదవండిIIT Jodhpur: రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఐటీ జోధ్‌పూర్‌ సరికొత్త ఆవిష్కరణ

#Tags