Shinkun La Tunnel : ‘షింకున్‌ లా టన్నెల్‌’ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ!

ద్రాస్‌ సెక్టార్‌లో జూలై 26న 25వ కార్గిల్‌ విజయ్‌ దివస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. షింకున్‌ లా టన్నెల్‌ ప్రాజెక్టు పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. లేహ్‌కు వెళ్లే రూట్‌లో ఈ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్‌ సుమారు 4.1 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ట్విన్‌ ట్యూబ్‌ టన్నెల్‌ను సుమారు 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. నిమి–పదుం–దర్చా రోడ్డు మార్గంలో ఈ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా టన్నెల్‌ ద్వారా లేహ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.

Women Entrepreneurs: గణనీయంగా పెరిగిన మహిళా పారిశ్రామి­క­వే­త్తల సంఖ్య..

#Tags