Ayushman Bharat: ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కేంద్రాల పేరు మార్పు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్, వెల్‌ నెస్‌ కేంద్రాల పేరు మారనుంది.

ఇక నుంచి వాటిని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ‘ఆరోగ్యం పరమం ధనం’ అని ట్యాగ్‌లైన్‌ గా పెట్టారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ నవంబర్‌ 25న ఒక సర్క్యులర్‌ విడుదల చేసింది. దేశంలో 1.6 లక్షల ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్, వెల్‌ నెస్‌ కేంద్రాలున్నాయని.. ఇక నుంచి వాటిని ‘ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌’లుగా పిలువనున్నట్టు పేర్కొంది. 

Jammu and Kashmir Reservation Bill: లోక్‌స‌భ‌లో 2 బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం

#Tags