Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం– బాల రాముని ప్రాణ ప్రతిష్ట

చారిత్రాత్మకంగా ప్రాముఖ్యమైన ధార్మిక క్షేత్రం మాత్రమే కాకుండా రాజకీయపరంగా దేశంలో పెను మార్పులకు కారణమైన అయోధ్య రామమందిరంలో జనవరి 22, 2024న బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది.

అయోధ్య రామాలయ విశేషాలు: 

  • అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 
  • ముఖ్యమంత్రి: యోగి ఆదిత్యనాథ్‌ 
  • గవర్నర్‌: ఆనందీబెన్‌ పటేల్‌ 
  • ప్రధాన ఆలయ విస్తీర్ణం: 2.67 ఎకరాలు (3 అంతస్థులు)
  • నిర్మాణ విస్తీర్ణం: 57,400 చదరపు అడుగులు 
  • ఆలయ శంకుస్థాపన: 05/08/2020
  • నిర్మాణ శైలి: నగర శైలి 
  • గర్భగుడిలో బాల రాముడి ఎత్తు: 51 అంగుళాలు 
  • విగ్రహ శిల్పి: అరుణ్‌ యోగిరాజ్‌ (కర్ణాటక)
  • శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఛైర్మన్‌: న్రిత్య గోపాల్‌ దాస్‌ 
  • దేవాలయ ఆర్కిటెక్ట్‌: చంద్రకాంత్‌ సోంపుర/ఆశీష్‌ సోంపుర/నిఖిల్‌ సోంపుర 
  • అయోధ్య కేసులో పోరాడిన ప్రముఖ న్యాయవాది: ఓ. పరసరన్‌ 
  • నిర్మాణ సంస్థలు: ప్రధాన దేవాలయాన్ని ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మించగా, ఇతర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్‌ చేపడుతున్నారు. 
  • అయోధ్య రామ మందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. మొదటిది కంబోడియాలోని అంకోర్వాత్‌ (విష్ణు దేవాలయం), కాగా రెండోది తమిళనాడులోని తిరుచురాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం. 

చదవండి: Ayodhya Ram Mandir Facts: అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇవే..

#Tags