Singareni: సింగరేణికి ఐఈఐ ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

బొగ్గు మైనింగ్‌ రంగంలో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది.
singareni collieries company limited

ప్రతిష్టాత్మకమైన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా (ఐఈఐ) ఏటా ప్రకటించే ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కోసం ఈ ఏడాది సింగరేణిని ఎంపిక చేసింది. ‘ఐఈఐ’ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో డిసెంబర్‌ 26వ తేదీన ప్రారంభమైన 36వ ఇండియన్‌ ఇంజినీరింగ్‌ కాంగ్రెస్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండే నుంచి సింగరేణి జీఎం కె.నాగభూషణ్‌ రెడ్డి అవార్డును స్వీకరించారు. ఐఈఐ అధ్యక్షుడు నరేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. శ్రేష్టమైన వాణిజ్య విలువలు పాటిస్తున్నందుకు సింగరేణిని అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

#Tags