Contract Employees : కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్..
సాక్షి ఎడ్యుకేషన్ : తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు.
114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన నవంబర్ 14వ తేదీన (మంగళవారం) ఉదయం అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అలాగే తిరుమల ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న 650 ఉద్యోగులను మరో ఏడాది పాటు పొడిగించారు.
#Tags