MBA Department: మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌పై అవగాహన

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జూలై 15న పాలమూరు యూనివర్సిటీ ఎంబీఏ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం రీసెర్చ్‌ మెథడాలజీ, ప్రాజెక్టు గైడెన్స్‌పై అవగాహన నిర్వహించనున్నారు.

దీనికి సంబంధించిన బ్రోచర్‌ను వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణయ్య ఆవిష్కరించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదవండి: GATE Ranker : గేట్‌లో ఉత్త‌మ ర్యాంకుతో ఉన్న‌త‌ స్థానానికి.. జాతీయ స్థాయిలో..

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిపుణులైన ప్రొఫెసర్లు వస్తారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీ నాగసుధ, అర్జున్‌కుమార్‌, రవికుమార్‌, రాజశేఖర్‌, జావెద్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags