Admissions: ఐటీఐలో ప్రవేశాలకు ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రెడ్ల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి సెప్టెంబర్ 24న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 11 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారన్నారు. అడ్మిషన్ల కోసం ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సంబంధిత ఐటీఐ కళాశాలకు వెళ్లాలని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకొవద్దని, సీట్లు రాని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలను సంప్రదించాలన్నారు.
చదవండి: Degree Spot Admissions: స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags