DEO Yadayah: 22న దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ

మంచిర్యాలఅర్బన్‌: తెలంగాణ సమగ్ర శిక్ష భా రత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీకి ఆగ‌స్టు 22న జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్దారణ శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో యాదయ్య తెలి పారు.

18 ఏళ్లలోపు దివ్యాంగ విద్యార్థులకు వినికిడి యంత్రాలు, వీల్‌చైర్‌, మూడు చక్రాల సైకిల్‌, స్కూటర్‌, క్రచ్చెస్‌, కృత్రిమ అవయవా లు, స్మార్ట్‌ఫోన్లు పొందడానికి శిబిరానికి హాజ రు కావాలని పేర్కొన్నారు.

చదవండి: Schools news: సర్కార్‌ బడుల్లో మూలకు పడ్డ కంప్యూటర్లు

ఆధార్‌ కార్డు, సద రం సర్టిఫికెట్‌, ఆదాయ ధ్రువపత్రం, రేషన్‌కా ర్డు జిరాక్స్‌, రెండు ఫొటోలు వెంట తీసుకుని రావాలని, పూర్తి వివరాలకు 8328363596 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

#Tags