ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
పెబ్బేరు రూరల్: మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి సంబంధించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీబాయి జూలై 12న ఒక ప్రకటనలో తెలిపారు.
ఆవిష్కరణలు, సృజన్మాత్మకత, సామాజికసేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సాంస్కృతిక, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర రంగాల్లో ప్రతిభ చాటిన 18 ఏళ్లలోపు బాలలు అర్హులని.. జూలై 31 వరకు http://awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
National Award: ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయ పురస్కారం
Srinivasan K.Swamy: ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఈయనే..
#Tags