IAS Officers : దేశానికి అత్యధికంగా 'ఐఏఎస్' ఆపీస‌ర్ల‌ను ఇచ్చే రాష్ట్రం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ప్ర‌తి సంవత్స‌రం సివిల్స్ సర్వీసెస్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తున్న విష‌యం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ఈ ఉద్యోగాల‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యువత సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతున్నారు.
highest ias officer state in india

వీరు ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్ఎస్ (IFS) మొద‌లైన ఉద్యోగాల‌కు.. ఎంపిక అవ్వాలనే ఒక బ‌ల‌మైన సంక‌ల్పంతో ప్రిపేరేష‌న్ సాగిస్తుంటారు. అలాగే ఈ ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే యువ‌త.. ఎక్కుగా టార్గెట్ చేసేది.. ఐఏఎస్ ఉద్యోగాల‌కే.  ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఏడాది ఐఏఎస్ ఉద్యోగాలు ఎక్కువ‌గా ఏఏ రాష్ట్రాల‌కు వ‌స్తున్నాయి.. అనే అంశంపై ప్ర‌త్యేక స్టోరీ మీకోసం..

గరిష్టంగా ఏ రాష్ట్రం నుంచి ఐఏఎస్‌ అధికారులు పుట్టుకొస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అభ్యర్థులు ఏ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల గరిష్ట సంఖ్య గురించి సమాచారాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం..

☛ Durishetty Anudeep, IAS Success Story : హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌.. అన్నింట్లోనూ టాప్‌.. ఈయ‌న స‌క్సెస్ సీక్రెట్ ఇదే..!

ఉత్తరప్రదేశ్‌ను దాటేసి..
సివిల్ సర్వీసెస్ పరీక్ష (సిఎస్‌ఇ-2021)లో 180 మంది అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)కి ఎంపికయ్యారు. ఈ 180 మంది అభ్యర్థుల్లో 24 మంది ఒక్క రాజస్థాన్‌కు చెందిన వారు. ఈ విధంగా.. రాజస్థాన్ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో ఐఏఎస్ (IAS) అధికారులను అందిస్తున్న రాష్ట్రంగా నిలిచింది. సివిల్ సర్వెంట్ల విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్‌ను దాటేసి రాజస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. 

ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఐఏఎస్‌లు ఎక్కువగా ఉండేవారు.సివిల్ సర్వీసెస్ పరీక్షలో మెరుగ్గా రాణించడానికి రాజస్థాన్‌లో ఉన్న అత్యుత్తమ కోచింగ్ సెంటర్లే ​​ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షపై యువతలో పెరుగుతున్న అవగాహన కూడా ఒక కారణం.

☛ UPSC Civils Ranker Success Story : ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీ చ‌దివితే.. కళ్లు చెమర్చక త‌ప్ప‌దు.. పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి నాది.. కానీ..

ప్రస్తుతం రాజస్థాన్‌లోని కోచింగ్‌ సెంటర్లలో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. విద్యార్థులు ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ మోడ్‌లో చదువుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఢిల్లీలో అత్యుత్తమ కోచింగ్ సెంటర్లు ఉండేవి, ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అలాగే తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో కూడా మంచి సివిల్స్ కోచింగ్ సెంట‌ర్లు ఉన్నాయి.

ఈ కారణాల వల్లనే రాజస్థాన్ అగ్రస్థానంలో..

యూపీఎస్సీ సివిల్స్‌ 2020లో అఖిల భారత స్థాయిలో 13వ స్థానంలో నిలిచిన గౌరవ్ బుడానియా ప్రస్తుతం రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నారు. బుడానియా మాట్లాడుతూ.. సివిల్స్‌లో ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపిక కావడం వల్ల.., భవిష్యత్ అభ్యర్థులు వారి నుంచి మంచి ప్రేరణ పొందడం ప్రారంభించారు. రాజస్థాన్‌లో మొత్తం జనాభాలో 25 శాతం SC/ST కమ్యూనిటీ ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వర్గాలలో ఎక్కువ అవగాహన ఉందని, దీని కారణంగా వారు ఎక్కువ సంఖ్యలో పరీక్షలకు హాజరవుతున్నారని 2020 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి తెలిపారు.

చ‌ద‌వండి: జీవితంలో ఓట‌మిని ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దు... వ‌రుస‌గా 35 సార్లు ఫెయిల్‌... చివ‌రికి ఐఏఎస్ సాధించానిలా

రికార్ట్ స్థాయిలో.. నాలుగేళ్లలో 84 మంది ఐఏఎస్‌లు..

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గత నాలుగేళ్ల గణాంకాల ప్రకారం.. రాజస్థాన్ మొత్తం 84 మంది ఐఏఎస్ అధికారులను తయారు చేసింది. గత మూడేళ్లుగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్స్(UPSC) పరీక్షలో.. రాజస్థాన్ నివాసితులైన 16 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. CSE-2020 పరీక్షలో.. రాజస్థాన్ నుంచి 22 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 

2021లో ఈ సంఖ్య 24కి పెరిగింది. CSE-2020 పరీక్షలో.. ఉత్తరప్రదేశ్ నుంచి 30 మంది అభ్యర్థులు IAS అధికారులుగా ఎంపికయ్యారు. ఈ సర్వీసెస్‌లో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడంతో రాజస్థాన్ రెండవ స్థానంలో నిలిచింది.

☛ UPSC Civils Ranker Success Story : ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీ చ‌దివితే.. కళ్లు చెమర్చక త‌ప్ప‌దు.. పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి నాది.. కానీ..

#Tags