Free Awareness Conference: పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు.. ఎక్క‌డంటే..

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌–1, 2 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ విద్యార్థులను గ్రూప్‌–1, 2 స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ (www.sakshieducation.com) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులను నిర్వహించనుంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ తోడుగా ఉంటుందన్న‌ విషయం తెలిసిందే.

గెస్ట్‌ స్పీకర్‌గా బాలలత..
ఎంతో మందిని పోటీ పరీక్షల్లో విజేతలుగా తీర్చిదిద్దుతున్న సివిల్స్‌ టాపర్‌ బాలలత గ్రూప్ 1, గ్రూప్‌ 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సుకు గెస్ట్‌ స్పీకర్‌గా హాజరుకానున్నారు. ఆమె గ్రూప్ 1, 2 పరీక్షలపై అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8977625795 నంబర్‌కు ఫోన్ చేసి తమ పేరు, ఫోన్‌ నంబర్‌, జిల్లా వివరాలను వాట్సాప్‌లో పంపగలరు.

అవగాహన సదస్సు తేదీ: డిసెంబర్‌ 11, 2023 (సోమవారం)
వేదిక: మహతి ఆడిటోరియం, బాలాజీ కాలనీ, టౌన్‌ క్లబ్‌ సమీపం, తిరుపతి
సమయం: ఉదయం 09.30 నుంచి 12.30 వరకు.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

#Tags