AP TRT/DSC Notification 2024: ఏపీలో సంక్షేమ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వివిధ సంక్షేమ విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ/డీఎస్సీ)2024 నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఖాళీలున్న విద్యా సంస్థలు: ఏపీ మోడల్‌ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్, ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఈఎస్, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌(గురుకులం).
పోస్టుల వివరాలు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ)–215,ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ)–1264,ప్రిన్సిపాల్‌–42,ఫిజికల్‌ డైరెక్టర్‌–13
ఉమ్మడి జిల్లాల వారీ పీజీటీ పోస్టులు: శ్రీకాకుళం–49,విజయనగరం–84, విశాఖపట్నం–95, తూర్పు గోదావరి–102,పశ్చిమ గోదావరి–59, కృష్ణా–65, గుంటూరు–137, ప్రకాశం–93, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు–102, చిత్తూరు–139, కడప–103,అనంతపురం–115, కర్నూలు–121
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ,పీజీ,బీఈడీ, బీపీఈడీ/ఎంపీఎడ్‌ విద్యార్హతతో పాటు ఏపీ టెట్‌/సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: ఓసీలకు 01.07.2024 నాటికి 44 ఏళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ట వయో పరిమితిగా నిర్ణయించారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష, రిజర్వేషన్‌ రూల్‌ తదితరాల ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: రాష్ట్ర వ్యాప్తంగా 122 పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు విడతలుగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 2.30 గంటల పాటు ఉంటుంది. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

ఫీజు చెల్లింపు చివరితేది: 21.02.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.02.2024.

వెబ్‌సైట్‌: https://apdsc.apcfss.in/

చదవండి: AP TRT & DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో 4,579 ఎస్‌ఏ/ఎస్జీటీ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags