Job Mela: సెప్టెంబ‌ర్ 2వ తేదీ జాబ్‌మేళా.. అర్హులు వీరే..

వికాస ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జాబ్‌మేళా నిర్వహించ‌నున్నారు. ఈ జాబ్‌మేళాలో అనేక ప్రముఖ కంపెనీలు పాల్గొని, వివిధ రంగాల్లో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తాయ‌ని వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. 

ఉద్యోగాల వివరాలు ఇవే..
క్యాపిటల్‌ ట్రస్ట్‌ లిమిటెడ్‌లో.. బీఎం, బీక్యూఎం, ఆర్‌వో, ఐఆర్‌ఈపీ క్రెడిట్‌ కెపిటల్‌లో సేల్స్‌ ఆఫీసర్‌, ఇండో ఎంఐఎం
పానాసోనిక్‌ కంపెనీల్లో.. టెక్నీషియన్‌
రిఫ్యూటెడ్‌ ఫార్మా కంపెనీలో.. టెక్నీషియన్‌, కెమిస్ట్‌, హెల్పర్‌, ట్రైనీ ఇంజనీర్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేయ‌నున్నారు. 

అర్హులు వీరే..
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్‌, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ, బీటెక్‌ (బయోటెక్నాలజీ, మైక్రో బయోలజీ - 2023, 2024 బ్యాచ్‌లు) చదివి.. 35 సంవత్సరాల లోపు వ‌య‌సు ఉన్న వారు అర్హులు. 

ఎంపికైన వారికి నెలకు రూ.12 నుంచి రూ.20 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్‌, భోజనం, వసతి, రవాణా సౌకర్యం(ఉద్యోగం ఆధారంగా) ఉంటుంది. 

ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 2వ తేదీ ఉదయం 9 గంటలకు కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్దకు సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో పాల్గొనవ‌చ్చు. మరింత సమాచారం కోసం 77993 76111 నంబ‌ర్‌లో సంప్రదించండి. 

Job Mela: నిరుద్యోగ యువతకు శుభ‌వార్త‌.. సెప్టెంబ‌ర్ 3వ తేదీ జాబ్‌మేళా.. ఎక్క‌డంటే..

#Tags