Job Fair: రేపు జాబ్ మేళా.. అర్హులు వీరే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి ఆధ్వ‌ర్యంలో సెప్టెంబర్‌ 3వ తేదీ నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించ‌నున్నారు.  దీనికి సంబంధించిన వివ‌రాల‌ను క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ శ‌శిక‌ళ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

ఈ జాబ్‌మేళాలో ఎనిమిది ప్రముఖ కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొంటార‌ని స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియెట్‌, ఐటీఐ, డిప్ల‌మో, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యుర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవ‌చ్చ‌న్నారు. అర్హ‌త‌లు ఉన్న వారు సెప్టెంబ‌ర్ 3వ తేదీ జ‌రిగే జాబ్‌మేళాకు హాజరు కావాల‌ని చెప్పారు. 

Job Mela: నిరుద్యోగ యువతకు శుభ‌వార్త‌.. సెప్టెంబ‌ర్ 3వ తేదీ జాబ్‌మేళా.. ఎక్క‌డంటే..

#Tags