Medical Faculty Training : వైద్యవిద్య అధ్యాపకులకు రెండు రోజుల శిక్షణ ముగిసింది..
తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలో వైద్యవిద్య అధ్యాపకులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సదస్సులో నేషనల్ మెడికల్ కమిషన్, న్యూ ఢిల్లీ వారు ప్రవేశ పెట్టిన నూతన బోధనా విధానాలు, పరీక్షల్లో మార్పులు చేర్పులపై అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు.
Teaching Students : టీచ్ టూల్ ట్రైనింగ్లో ఉపాధ్యాయులకు సూచనలు.. విద్యార్థులకు బోధన ఈవిధంగా!
ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ మొత్తం 30 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కిరీటి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డీఎస్ మూర్తి, డాక్టర్ ప్రతిభ స్రవంతి, డాక్టర్ రమాదేవి, డాక్టర్ మాధవీలత, డాక్టర్ మనోహర్, డాక్టర్ ఇంద్రాణి, డాక్టర్ ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.