National Scholarships: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.. ఇదే చివరి తేది

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ విద్యా సంవత్సరం జరగనున్న నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 17తో గడువు ముగుస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం ఒక ప్రకటనలో తెలిపారు.

4-year degree courses: నాలుగేళ్ల డిగ్రీ కోర్సు 'ఐటెప్‌'కు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు.

Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

ఈ పరీక్ష వచ్చే డిసెంబర్‌ 8న జరుగుతుందని, పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని, దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు.

#Tags