Dussehra holidays: నేటి నుంచి ట్రిపుల్‌ ఐటీలకు దసరా సెలవులు

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు ఈనెల 21 నుంచి 29 వరకు దసరా సెలవులను ఆర్జీయూకేటీ ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం ఈనెల 30న ట్రిపుల్‌ఐటీలు పునఃప్రారంభంకానున్నాయి. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. నూజివీడులోని ట్రిపుల్‌ఐటీకి చెందిన విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లేందుకు నూజివీడు ఆర్టీసీ అధికారులు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌ నుంచి 66 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

చ‌ద‌వండి: Contract Employees: ఏపీ ‘కాంట్రాక్టు’ ఉద్యోగులకు శుభవార్త

#Tags