Bridge Course: బ్రిడ్జి కోర్సు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు ఐటీఐ రెండేళ్లు కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించే బ్రిడ్జి కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ) ప్రిన్సిపాల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు.

జనవరి 2 నుంచి 31 వరకు బ్రిడ్జి కోర్సు ట్రైనింగ్‌ ప్రోగ్రాం ఉంటుందన్నారు. డిసెంబ‌ర్‌ 31లోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ట్రైనింగ్‌ ఆఫీసర్‌ సిహెచ్‌.లలిత కుమారి(కోపా ట్రేడ్‌) కంచరపాలెం పాత ఐటీఐలో సంప్రదించాలని కోరారు.

కరోనా నష్టం.. ‘బ్రిడ్జి కోర్సు’ పాఠం

#Tags