Backlog posts Exams: SC, ST బ్యాక్‌లాగ్‌ పోస్టుల అర్హత పరీక్షలు ప్రారంభం

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రాథమిక అర్హత పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

గుంటూరు నగరం సిద్ధార్థనగర్‌లోని జేసీ కాలేజీ ఆఫ్‌ లా కాలేజీలో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లిష్‌ భాష, చదవడం, రాయడం వంటి అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణ తీరును జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌తేజ పరిశీలించారు.

Navodaya Admission 2024: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలు.. ఈ విద్యార్థులు అర్హులు

మంగళవారం ఉదయం, మధ్యాహ్నం జరిగిన డ్రెయిన్‌ క్లీనర్‌ పోస్టుకు 86 మంది అభ్యర్థులకు 43 మంది, గ్యాంగ్‌ మజ్దూర్‌ పోస్టుకు 385 మంది అభ్యర్థులకు 228 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో డీఈఓ శైలజ, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ మధుసూదనరావు పాల్గొన్నారు.
 

#Tags