Aadudam Andhra: జిల్లాస్థాయి పోటీలోంచి రాష్ట్ర‌స్థాయి పోటీల్లోకి క్రీడాకారులు..

ఆడుదాం ఆంధ్ర జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరచి ప్రథమ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు ఇప్పుడు రాష్ట్ర‌స్థాయిలో ఆడేందుకు సిద్ధ‌మ‌య్యారు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆడుదాం ఆంధ్ర జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరచి ప్రథమ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు రాష్ట్ర పోటీల్లోనూ సత్తాచాటాలని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి తెలిపారు. శుక్రవారం నుంచి విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర పోటీలకు వెళ్లే జిల్లా క్రీడాకారుల బృందం బస్సుకు జేసీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో ముచ్చటించారు.

DSC Notification: నిరుద్యోగుల‌కు వ‌రంగా మారిన డీఎస్‌సీ నోటిఫికేష‌న్‌..!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రికెట్‌, కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 114 మంది పురుషులు, మహిళలు రాష్ట్ర పోటీలకు వెళుతున్నారన్నారు. అన్ని క్రీడలకు కిట్స్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందించి గ్రామస్థాయి నుంచి క్రీడాకారులను నగదు బహుమతులతో ప్రోత్సహించిందన్నారు. సమావేశంలో డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ జి.వెంకటేశ్వరరావు, క్రీడా కోచ్‌లు పాల్గొన్నారు.

#Tags